Jagan: నేడు 16వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర
Jagan: నారాయణపురం నుంచి బస్సుయాత్ర ప్రారంభం
Jagan: నేడు 16వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర
Jagan: ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజుకు చేరుకుంది. బస్సుయాత్ర ఇవాళ ఏలూరు జిల్లాలో కొనసాగనుంది. కాసేపట్లో నారాయణపురం నుంచి యాత్ర ప్రారంభంకానుంది. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండికి చేరుకుంటారు సీఎం జగన్. అనంతరం ఉండి శివారు నుంచి భీమవరం బైపాస్ మీదుగా కొనసాగుతుంది. తర్వాత గ్రంధి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ దగ్గర జరిగే సభలో పాల్గొంటారు. పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోటకు చేరుకుంటారు సీఎం జగన్.