ఘటనా స్థలికి ముఖ్యమంత్రి జగన్

Update: 2019-09-15 15:33 GMT

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. నదిలో 41 మంది గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇప్పటికే 12 మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. చీకటిపడటంతో సహాయక చర్యలు ఆగిపోయాయి. సోమవారం ఉదయం ఘటనా స్థలికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు. అలాగే ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకోనున్నాయి. 

Tags:    

Similar News