పుత్రుడిని, దత్తపుత్రుడిని ఒకేసారి రోడ్డు మీదకు పంపారు : సీఎం జగన్

Update: 2020-12-29 16:15 GMT

వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్‌ పథకం మూడో విడత నిధుల విడుదల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ సెటైర్లు వేశారు. నివర్ నష్టపరిహారం ఇస్తామని ఇప్పటికే పలుమార్లు చెప్పామని అయినా చంద్రబాబు ప్రతిపక్షనేతగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పుత్రుడిని, దత్తపుత్రుడిని ఒక్క రోజు ముందు చంద్రబాబు రోడ్డు మీదకు పంపారని సెటైర్లు వేశారు. చంద్రబాబు జూమ్‌కు దగ్గరగా భూమికి దూరంగా ఉంటున్నారన్నారు.

Tags:    

Similar News