మాజీ మంత్రి ఆనం రామనారాయణ్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదర్శిస్తే, వేటు తప్పదన్నారు సీఎం జగన్. అవసరమైతే ఆనంను సస్పెండ్ చేయండంటూ ఆదేశాలిచ్చారు. ఆనం వ్యాఖ్యలపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులివ్వాలని ఆదేశించారు. ఇటీవల రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబుతో ఆనం భేటీ అయ్యారని వైసీపీకి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.