సీఎం జగన్‌కు మరో కీలక పదవి

Update: 2020-08-29 05:05 GMT

Jagan: ఏపీ సీఎం జగన్ మరో కీలక పదవిని చేపడుతున్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్మెంట్‌ కోసం జ‌గ‌న్ స‌ర్కార్ ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుబంధంగా ఎగ్జి‌క్యూటివ్ క‌మిటీని కూడా నియమిస్తూ నోటిఫికేషన్ వెలువ‌రించారు.

ఏపీ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం జగన్ నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు వివిధ శాఖలకు చెందిన 11 మంది ముఖ్యకార్యదర్శులను, ఉన్నతాధికారులను సభ్యులుగా పేర్కొంటూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ఛైర్మన్‌గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే పలు శాఖలు సీఎం చేతిలో ఉన్న విషయం విదితమే. తాజాగా జగన్‌కు మరో పదవి వచ్చింది.




Tags:    

Similar News