వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. వెంకటరెడ్డిపై.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు దాడి

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. వెంకటరెడ్డిపై.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు దాడి

Update: 2019-09-26 01:34 GMT

నందికొట్కూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలోని రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ప్రాతకోట వెంకటరెడ్డిపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నందికొట్కూరు జీవన జ్యోతి స్కూల్ వద్ద కాపుకాసి దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు కారణం ప్రాతకోట విద్యాకమిటీ ఎన్నికల్లో తలెత్తిన వివాదం అని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్నఎమ్మెల్యే ఆర్థర్ ఆసుపత్రికి వెళ్లారు. ఈ విషయంపై నంద్యాల వైసీపీ పార్లమెంటు అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు గ్రామంలో గొడవలు చెలరేగడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రెండు వర్గాలను పిలిచి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News