ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ భేటీ అయ్యారు. శనివారం ఢిల్లీ నుంచి నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన.. జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ.. త్వరలోనే ముఖ్యమంత్రితో మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు.