ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు జగన్మాయగా మారింది : చంద్రబాబు

Update: 2019-10-29 07:25 GMT

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇసుక సంక్షోభంతో రోజు కూలీలు బలవుతున్నారన్నారు. ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు జగన్మాయగా మారిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చెప్పారు. టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

టీడీపీ అభివృద్ధి పనులన్నీ రివర్స్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతల బాధితులంతా మానవహక్కుల బృందాన్ని కలువాలని కోరారు. ఐదు నెలల్లో 620 చోట్ల ఆరాచకాలకు పాల్పడ్డారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News