AP News: ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

AP News: కూటమి అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం

Update: 2024-04-06 02:25 GMT

AP News: ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

AP News: అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకమవుతున్నారు. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. పెద్దకూర పాడు, సత్తెన పల్లి ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారు. అక్కడి కూటమి అభ్యర్థుల తరపున టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. ప్రతిరోజు రెండు మీటింగ్‌లు జరిపేలా టీడీపీ ప్రణాళికలు రూపొందించింది. తొలి విడత 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. రేపు పామర్రు, పెనమలూరులో జరిగే టీడీపీ ప్రజాగళం సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.

Tags:    

Similar News