సీఎం జగన్ మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వ విధానంపై జగన్.. ఫెయిల్యూర్ సీఎం అంటూ ట్వీట్ చేశారు. తప్పును ఎత్తిచూపించే వాళ్ల నోళ్లు నొక్కేయాలనుకోవడం.. వైసీపీ ప్రభుత్వం పిరికితనానికి నిదర్శనమన్నారు. వాక్కు స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిందని, వాటిని హరించడం అప్రజాస్వామికమన్నారు. తమ పనుల పట్ల చిత్తశుద్ధి, నమ్మకం ఉంటే ఎందుకిలా భయపడుతున్నారని ప్రశ్నించారు చంద్రబాబు.
తప్పును ఎత్తిచూపించే వాళ్ళ నోళ్ళు నొక్కేయాలనుకోవడం వైసీపీ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించింది. వాటిని హరించడం అప్రజాస్వామికం. తమ పనులపట్ల చిత్తశుద్ధి, నమ్మకం ఉంటే ఎందుకిలా భయపడుతున్నారు?#JaganFailedCM
— N Chandrababu Naidu (@ncbn) October 17, 2019