AP News: కృష్ణా జిల్లా పెడనలో చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ప్రచారం

AP News: మాలో మేం కొట్టుకోవాలని జగన్‌ చూస్తున్నారు

Update: 2024-04-17 14:29 GMT

AP News: కృష్ణా జిల్లా పెడనలో చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ప్రచారం

AP News: మరొక రోజులో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న ఏపీలో పార్టీ ప్రచారం మరింత వేడెక్కింది. కృష్ణా జిల్లా పెడనలో ఎన్డీఏ కూటమి నేతలు చంద్రబాబు, పవన్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. గడిచిన ఐదేళ్లలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని పవన్ కల్యాణ్ విమర్శించారు. కూటమి నేతలు కొట్టుకునేలా జగన్ వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా.. కలసి కట్టుగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దోపిడీ రాజ్యం పోయి రామరాజ్యం రావాలంటే వైసీపీని తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపిచ్చారు. తమ దగ్గర డబ్బు లేదు.. నీతి, నిజాయితీ మాత్రమే ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News