CM Jagan: సీఎం జగన్‌ను కలవనున్న బాలినేని, మాగుంట

CM Jagan: భేటీ తర్వాత ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ స్థానంపై క్లారిటీ వచ్చే ఛాన్స్

Update: 2023-12-28 08:00 GMT

CM Jagan: సీఎం జగన్‌ను కలవనున్న బాలినేని, మాగుంట

CM Jagan: అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల వడపోతను స్టార్ట్ చేసిన సీఎం జగన్‌ మరిన్ని వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో వైపు సీఎం జగన్ నిర్ణయాలతో వైసీపీ శిబిరంలోని నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లాయి. ఇందులో భాగంగానే తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు. కాసేపట్లో ఇద్దరు నేతలు సీఎం జగన్‌తో సమావేశంకానున్నారు. వైసీపీ బాస్‌తో జరగనున్న సమావేశంలో ఒంగోలు, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News