Simhachalam: అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన మంత్రి అవంతి

దేవస్థానం పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శ్రీనివాస్ భూమి పూజ చేశారు.

Update: 2020-02-01 12:15 GMT

సింహాచలం: దేవస్థానం పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శ్రీనివాస్ భూమి పూజ చేశారు. భక్తుల కోసం దేవస్థానం నిర్మించ తలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ను అలాగే దేవస్థానం ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్థానిక బస్టాండ్ సమీపంలో ఏటీఎం ను ప్రారంభించారు. అలాగే గ్రామ సచివాలయం అడవివరం పాత పంచాయతీ కార్యాలయం వద్ద ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వెంకటేశ్వరరావు, ఉద్యోగుల సంఘం నాయకులు పాలూరి నరసింగరావు, తిరుమల ఈశ్వరరావు స్థానిక వైయస్సార్ సిపి నాయకులు, వీజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.

Tags:    

Similar News