Andhra News: ఆశావర్కర్ల ఆందోళన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
Andhra News: నిడదవోలు రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
Andhra News: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆశావర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన తెలుపుతున్న ఆశావర్కర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తారన్న అనుమానంతో పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిడదవోలు రైల్వేస్టేషన్ వద్ద మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. తాలూకా రైస్ మిల్సర్స్ అసోసియేషన్ హాల్లో వారిని నిర్బంధించారు. ఆశావర్కర్లకు జగన్ ఇచ్చిన హామీలను వెంనటే పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలిపారు.