Andhrapradesh: నేటి నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కడప డిపో నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ నిరంజన్ తెలిపారు.

Update: 2020-01-10 08:21 GMT

కడప: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కడప డిపో నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ నిరంజన్ తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ, వారి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు నేటి నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

బెంగళూరు నుండి కడపకు 14, హైదరాబాద్ నుండి4, విజయవాడ నుండి 4, చెన్నై నుండి 2 ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచామన్నారు.11వ తేదీ నుండి విజయవాడ నుండి 14, చెన్నై నుండి 2, బెంగళూరు నుండి 8 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News