ఏపీలో 3.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట

Update: 2019-02-07 15:38 GMT

అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. బాధితులకు 250 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డబ్బు 10 వేల రూపాయల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు ఉపయోగపడనుంది. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు 250 కోట్ల రూపాయలు కేటాయిస్తూ గురువారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10వేల రూపాయల లోపు డిపాజిట్లు కలిగిన బాధితులు 3.5 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారికి ప్రభుత్వం తరపునే సహాయం చెయ్యాలని ఇటీవల క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జిల్లా స్థాయి కమిటీల ద్వారా చెల్లింపులు చేయాలని మరోసారి స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. 

Similar News