నిరుద్యోగులకు శుభవార్త.. వచ్చే నెలలో మెగా డీఎస్సీ: మంత్రి సురేష్‌

Update: 2019-12-09 07:25 GMT
ఆదిమూలపు సురేష్

ఏపీలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 7900 పోస్టులతో డీఎస్సీ ఉంటుందని తెలిపారు. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు పై విధంగా మంత్రి సమాధానమిచ్చారు.

7900 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి సురేష్ ప్రకటన చేశారు. ఈ క్రమంలో సురేష్‌ మాట్లాడుతూ ప్రతీ ఏడాది జనవరిలో అన్ని శాఖల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా పేదలందరికీ ఇంగ్లీషు మీడియంలో విద్య అందించేలా తమ ప్రభుత్వం విద్యాసంస్కరణలు చేపట్టిందని సభకు తెలిపారు.

Tags:    

Similar News