సచివాలయ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎంపికైన అభ్యర్థులు కాల్ లెటర్లో పేర్కొన్న తేదీల్లో వివిధ కారణాలతో వెరిఫికేషన్కు హాజరు కాలేకపోయినా, హాజరైనా అన్ని ఒరిజనల్స్ చూపలేకపోయినా.. వారికి మరో ఛాన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలకు ఆదేశించారు. శనివారం నుంచి ఐదు జిల్లాల్లో షార్టు లిస్టులు విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్, ఈ మెయిల్ పద్ధతిలో సమాచారం పంపే కార్యక్రమం చేపట్టినట్టు గిరిజా శంకర్ వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఈ నెల 23, 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమం జరగనుందని.. ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలో ఉంటుందని తెలిపారు. షార్ట్ లిస్టులో పేరున్న వారు తమ కాల్ లెటర్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.