మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంట విషాదం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంట విషాదం నెలకొంది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంట విషాదం నెలకొంది. ఆనందబాబు సోదరుడు ప్రసాదబాబు అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఆనందపేటలోని శ్మశానవాటికలో ప్రసాదబాబు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రసాదబాబు కూడా సోదరుడు ఆనందబాబుకు మద్దతుగా టీడీపీలో వ్యవహరిస్తు వచ్చారు.
ప్రసాదబాబు మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ప్రసాదబాబు భౌతికకాయానికి నివాళులర్సించారు. మాజీ మంత్రులు పుల్లారావు, జవహర్, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీ.వీ.ఆంజనేయులు ఫోన్లో ఆనందబాబును పరామర్శించారు.