ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఊరట

లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో తమ విధులకు హాజరుకాలేకపోతున్న సచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది.

Update: 2020-05-26 14:45 GMT
Ap secretariat (file photo)

లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో తమ విధులకు హాజరుకాలేకపోతున్న సచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది. వారంతా హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లో చిక్కుకుని విధులకు తమ ఉద్యోగులకు విధులకు రాలేకపోతున్నారని... ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం వేసే బస్సులకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు.

400 మందికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎస్‌ లేఖలో కోరారు. ఈ మేరకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్‌ నుంచి 10 ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతి వెళ్లనున్నారు. కాగా.. ఇతర అంతరాష్ట్ర సర్వీసులకు ప్రభుత్వాలు అనుమతించని విషయం తెలిసిందే. 


Tags:    

Similar News