జాగ్రత్త బాబు .. నీకు 71 ఏళ్లు అని వైరస్ పసిగడుతుంది.. వైసీపీ ఎంపీ సెటైర్లు

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును ట్విట్టర్ వేదికగా మరోసారి టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

Update: 2020-05-19 06:38 GMT
Chandrababu Naidu (File Photo)

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును ట్విట్టర్ వేదికగా మరోసారి టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాయలసీమకు నీరందించే పోతిరెడ్డిపాడుపై మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశించారు.

ట్వీట్ లో ఆయన సగం .. రాష్ట్రానికి తాగు, సాగు నీరందించే పోతిరెడ్డిపాడు గురించి నోరు మెదపడు. ఎవరో సస్పెండైన డాక్టరు తాగి రోడ్డుమీద చిందులేస్తే ఒకటే ట్వీట్లు పెడుతున్నాడు. ప్యాకేజీ తీసుకుని పనిచేసే జీతగాళ్లను కూడా ఎగదోస్తున్నాడు. వ్యక్తుల ప్రయోజనాలు తప్ప రాష్ట్రం గురించి పట్టదా చంద్రబాబూ? అంటూ నిలదీశారు.

మరో ట్వీట్ లో.. కరోనా మనతోటే ఉంటుంది కాబట్టి 65 ఏళ్లు దాటినోళ్లు బయటకు రావద్దని కేసీఆర్ గారు కూడా చెప్పారు. జాగ్రత్త బాబూ! నీకు 71 ఏళ్లు అని వైరస్ ఇట్టే పసిగడ్తుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం, ప్రతిపక్ష నేతగా పదకొండేళ్లు లాంటివి కరోనాకు అర్థం కావు చంద్రబాబు అంటూ.. విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.




Tags:    

Similar News