ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..

Update: 2019-09-17 06:23 GMT

టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్‌ల ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దాంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్, జస్టిస్‌ ఎం.గంగారావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 14కి వాయిదా వేసింది.  

Tags:    

Similar News