ఏపీలో నగలు వస్త్ర దుకాణాలకు అనుమతి..
కరోనా కారణంగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలను మళ్లీ పట్టాలెక్కించాలని భావిస్తున్న జగన్ సర్కార్ భావిస్తుంది.
కరోనా కారణంగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలను మళ్లీ పట్టాలెక్కించాలని భావిస్తున్న జగన్ సర్కార్ భావిస్తుంది. లాక్డౌన్ నాలుగో దశ నిబంధనల సడలింపుల భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వస్త్ర, నగలు, చెప్పుల దుకాణాలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తూ.. పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
* పెద్ద షాపింగ్ మాల్స్ లో ఆన్లైన్లో ముందస్తు బుకింగ్ చేసుకోవాలి.
* వస్త్ర దుకాణాల్లో ట్రయల్ రూమ్లకు అనుమతి లేదు.
* ఆభరణాల దుకాణాల్లో డిస్పోజబుల్ చేతి తొడుగులు ఉండాలి.
* చెప్పుల దుకాణాలు, ఫ్రాంచైజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
* పానీపూరీ, మసాల బండ్లకు అనుమతి నిరాకరణ.
* స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవారు మాస్కులు, చేతికి గ్లోస్ ధరించాలి.
* రోడ్డపై విక్రయించే ఆహారం అక్కడ తినకుండా చూడాలి.