ఇవాళ సోమశిల రెండోదశ పనులకు శ్రీకారం

Update: 2020-11-09 02:51 GMT

CM Jagan (file image)

Andhra Pradesh | ఇవాళ సోమశిల రెండో దశ పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. వర్చువల్ విధానంలో సోమశిల హైలెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ దశలో దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మండలాల్లో 46వేల 453 ఎకరాలకు నీళ్లందనున్నాయి. సోమశిల జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి.. తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు.. 90 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

SHLLC తొలి దశలో మిగిలిన పనులతో పాటు రెండో దశ పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించింది. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులకుతోడు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది.

Tags:    

Similar News