ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.. రుషికొండ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంపై చర్చ
అమరావతిలో కూటమి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామి, కందుల దుర్గేశ్ పాల్గొన్నారు.
అమరావతిలో కూటమి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామి, కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం రుషికొండలో హరిత రిసార్ట్స్ స్థానంలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టింది. ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను అందించనుంది.