ఏపీ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు నిధుల కేటాయింపుల నిలిపివేత

Update: 2019-12-07 06:01 GMT

ఏపీ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు సంబంధించిన వివిధ పనులకు నిధులు కేటాయిస్తూ జారీ చేసిన జీవోలు నిలిపివేశారు. తాడేపల్లితో పాటు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ నివాసానికి సెక్యూరిటీ కోసం కేటాయించిన నిధుల జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది.

తాడేపల్లి నివాసానికి ఫర్నిచర్‌ కొనుగోలు, విద్యుత్‌ సౌకర్యం, ఇతర వసతుల కోసం కేటాయించిన నిధులను నిలిపివేశారు. సుమారు 3 కోట్ల విలువైన పనులకు సంబంధించిన కేటాయింపులు రద్దయ్యాయి. సీఎం నివాసానికి ఏర్పాట్ల కోసం ప్రభుత్వమే నిధులు భరించాల్సి ఉన్నప్పటికీ సీఎం జగన్‌ వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు రద్దుకు సంబంధించిన 6 జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది.

Tags:    

Similar News