'నేను ఆ పార్టీలో చేరుతున్నా' : ఆదినారాయణరెడ్డి

Update: 2019-09-07 05:35 GMT

మాజీ మంత్రి, టీడీపీ కీలక నాయకుడు చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తనకు దేశభక్తి ఎక్కువనీ, కడప జిల్లా అభివృద్ధి కోసమే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో అభ్యర్థుల ఎంపిక సరిగా లేదని.. అందువల్లే తాను ఓటమి చెందానని అన్నారు. ఇక బీజేపీలోకి తనతోపాటు ఎవరు వస్తారో తెలియదని తాను మాత్రం పార్టీ మారడం ఖాయంమన్నారు. కాగా ఆదినారాయణరెడ్డి రేపో మాపో అనుచరులతో సమావేశం అయిన తరువాత చేరిక తేదిని ప్రకటించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News