ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ గిల్క్రిస్ట్ సడన్ గా అనంతపురంలో ప్రత్యక్షమయ్యాడు. ఫోటో చూసి అతను క్రికెట్ ఆడటం కోసం వచ్చాడని అనుకోవద్దు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్ విద్యుత్ సదుపాయం ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పరిశీలించేందుకు గిల్క్రిస్ట్ ఇక్కడికి బయలుదేరారు. మార్గమధ్యలో అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను అతడు సందర్శించాడు. అనంతరం స్టేడియం మొత్తం కలియతిరుగుతూ.. వసతులను పరిశీలించాడు. ఈ సందర్భంగా గిల్క్రిస్ట్ మాట్లాడారు.. అనంతరపురం ఆర్డీటీ క్రికెట్ మైదానం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్ను బాగా ఆరాధిస్తారని వ్యాఖ్యానించాడు.