బీజేపీ నేత రాంమాధవ్ తో గంటా శ్రీనివాసరావు భేటీ.. నిజమేనా!

Update: 2019-10-26 03:50 GMT

ఇప్పటికే టీడీపీకి చెందిన చాలామంది కీలక నేతలు బీజేపీ, వైసీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే.. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ఓ ఫోటో టీడీపీ శ్రేణులను నివ్వెరపాటుకు గురిచేస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీ అగ్రనేత రామమాధవ్ తో సమావేశం అయినట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీంతో గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. గంటా వర్గం కూడా ఈ ఫోటోపై క్లారిటీ ఇవ్వకపోవడం ఇందుకు బలం చేకూరినట్టయింది. విశాఖ నార్త్ నియోజకవర్గంనుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు గంటా. టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన వైసీపీలో చేరాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గంటా చేరికకు అడ్డుచెప్పడంతో కుదరలేదు. ఈ క్రమంలో గంటా బీజేపీలో చేరతారని భావిస్తున్న తరుణంలో ఈ ఫోటో బయటికి రావడంతో చర్చనీయాంస్యమైంది. 

Tags:    

Similar News