బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి.. తెలుగులో ట్వీట్..

Update: 2019-09-15 12:34 GMT

గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని సహాయక చర్యలను ముమ్మరం చేయాలనీ ఆదేశించారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.' అంటూ ట్వీట్ చేశారు ప్రధాని. 

Tags:    

Similar News