ఏపీ సర్కారుకు కేంద్రం షాక్.. ఐపీఎస్‌ స్టీఫెన్‌ రవీంద్ర..

Update: 2019-09-04 04:28 GMT

ఏపీ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణ క్యాడర్ కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్రను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో ఆయన్ను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గా నియమించాలని భావించిన ఏపీ సర్కారు ఆశ నిరాశయింది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం జగన్... హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీగా ఉన్న స్టీఫెన్‌ రవీంద్రను తమ రాష్ట్రానికి పంపాలని కోరారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒకే చెప్పారు. రెండు రాష్ట్రాలూ పరస్పరం అంగీకారంతో యూపీఎస్సీకి లేఖ రాశాయి. కానీ కేంద్రం స్టీఫెన్ రవీంద్ర కేడర్‌ మార్పు కుదరదని తేల్చి చెప్పింది. 

మీ అభిప్రాయం చెప్పండి 



Tags:    

Similar News