News Analysis: వైసీపీ టెంట్లు పీకేయడం అన్యాయం.. టీడీపీ సమాధానం చెప్పాలి: మస్తాన్ రావు!

News Analysis: ఏపీ డీఎస్సీ ఎంపికల వివాదం, విజయవాడలో మల్లాది విష్ణు-బోండా ఉమా వర్గాల మధ్య ఘర్షణ మరియు వైఎస్సార్‌సీపీ హైకోర్టులో వేసిన పిటిషన్లపై రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు స్పష్టమైన విశ్లేషణ.

Update: 2026-08-07 07:02 GMT

News Analysis: వైసీపీ టెంట్లు పీకేయడం అన్యాయం.. టీడీపీ సమాధానం చెప్పాలి: మస్తాన్ రావు!

News Analysis: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల వివాదంపై నడుస్తున్న రాజకీయ రగడపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు 'హెచ్‌ఎమ్‌టీవీ' న్యూస్ ఎనాలసిస్‌లో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీరును, అధికార టీడీపీ ప్రవర్తనను రెండింటినీ ఆయన తప్పుపట్టారు.

విజయవాడలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నిరసన తెలుపుతుంటే, టీడీపీ నేత బోండా ఉమా మరియు కార్యకర్తలు వెళ్లి టెంట్లు పీకేయడాన్ని మస్తాన్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. "చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం టీడీపీకి ఎవరిచ్చారు? ఏమైనా అభ్యంతరాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ, ఇలా నేరుగా వెళ్లి ఘర్షణ పడితే శాంతిభద్రతల సమస్య వస్తుంది. గతంలో వైఎస్సార్‌సీపీ కూడా నిరసనలను అణచివేసే ప్రయత్నం చేస్తే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తోందా? దీనికి టీడీపీ సమాధానం చెప్పాలి" అని నిలదీశారు.

Full View

Tags:    

Similar News