Mellacheruvu: మేళ్ళచెరువు పోలీస్ స్టేషన్లో ఎస్పీ నరసింహ తనిఖీలు
Mellacheruvu: మేళ్ళచెరువు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సూర్యాపేట ఎస్పీ నరసింహ. శంభులింగేశ్వర జాతర ఏర్పాట్లపై సమీక్ష, వనమహోత్సవంలో 2 వేల మొక్కలు నాటే కార్యక్రమం.
Mellacheruvu: మేళ్ళచెరువు పోలీస్ స్టేషన్లో ఎస్పీ నరసింహ తనిఖీలు
మేళ్ళచెరువు: సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, త్వరలో జరగనున్న ఆలయ జాతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి వనమహోత్సవంలో భాగంగా రెండు వేల మొక్కలు నాటారు. ఈ ప్రాంతంలో మహిళలు, విద్యార్థుల భద్రత కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళు, వ్యాపార కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఇక ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు వ్యవసాయ అధికారుల సూచనలతో ఆరుతడి పంటలు సాగు చేయాలని, నకిలీ ఎరువులతో మోసపోవద్దని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించినా, నేరాలను ప్రోత్సహించినా ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ నరసింహ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.