Nandyal: జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం కారు టైరు పేలి ఆళ్లగడ్డ ఏఎస్ఐ మృతి
Nandyal: తమ్మరాజుపల్లె సమీపంలో కారు అదుపుతప్పి ఆళ్లగడ్డ రూరల్ ఏఎస్ఐ సురేష్ రెడ్డి మృతి. ఎస్బీ కానిస్టేబుల్ సహా నలుగురికి గాయాలు, శాంతిరాం ఆస్పత్రికి తరలింపు.
Nandyal: జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం కారు టైరు పేలి ఆళ్లగడ్డ ఏఎస్ఐ మృతి
నంద్యాల: నంద్యాల–కర్నూలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏఎస్ఐ సురేష్ రెడ్డి మృతి..తమ్మరాజుపల్లె సమీపంలో కారు టైరు పేలడంతో అదుపు తప్పిన వాహనం.. మరో నలుగురికి గాయాలు నంద్యాల–కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి నంద్యాల వైపు వస్తున్న క్రెటా కారు పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపానికి చేరుకోగానే టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా విధులు నిర్వహిస్తున్న సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. సురేష్ రెడ్డి గతంలో నంద్యాల, పాణ్యం పోలీస్ స్టేషన్లో కూడా విధులు నిర్వహించారు.
అదే కారులో ప్రయాణిస్తున్న ఎస్బీ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్ రెడ్డితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని శాంతిరాం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, అనంతపురంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పాణ్యం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టైరు పేలడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో నంద్యాల–కర్నూలు జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం ప్రయాణికులు, వాహనదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.