DA Hike: కేంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్: 4 శాతం పెరగనున్న డీఏ.. పెన్షనర్లకు కూడా పండగే!

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై త్వరలో క్లారిటీ. 3 నుంచి 4 శాతం పెరిగే అవకాశం. 53 శాతం మార్కును దాటనున్న కరువు భత్యం. ఏప్రిల్‌లో ప్రకటన వెలువడే ఛాన్స్. పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (DR) ప్రయోజనం.

Update: 2026-04-04 05:59 GMT

DA Hike: కేంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్: 4 శాతం పెరగనున్న డీఏ.. పెన్షనర్లకు కూడా పండగే!

DA Hike: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (DA) పెంపుపై కదలిక వచ్చింది. సాధారణంగా మార్చిలోనే రావాల్సిన ఈ ప్రకటన, ఏప్రిల్ నెల వచ్చినా ఇంకా వెలువడకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే, దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

ఎందుకు ఆలస్యమవుతోంది?

నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఇది అసాధారణ ఆలస్యం ఏమీ కాదు. డిసెంబర్ వరకు ఉన్న వినియోగదారుల ధరల సూచీ (AICPI) గణాంకాలను సేకరించి, ద్రవ్యోల్బణ పరిస్థితులను సమీక్షించి, క్యాబినెట్ ఆమోదం పొందేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

పెంపు ఎంత ఉండవచ్చు?

ప్రస్తుత అంచనాల ప్రకారం.. కేంద్రం ఈసారి 3 శాతం నుంచి 4 శాతం వరకు డీఏ పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం డీఏ 50 శాతంగా ఉంది. తాజా పెంపుతో ఇది 53 శాతం లేదా 54 శాతానికి చేరుకోవచ్చని నిపుణులు లెక్కగడుతున్నారు.పెరుగుతున్న ఆహార, ఇంధన ధరల (ద్రవ్యోల్బణం) ఆధారంగా ఈ పెంపును నిర్ణయించనున్నారు.

పెన్షనర్లకు భారీ ఊరట:

ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా 'డియర్నెస్ రిలీఫ్' (DR) రూపంలో ఇదే స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. స్థిర ఆదాయం కలిగిన విశ్రాంత ఉద్యోగులకు ఈ 3-4 శాతం పెంపు నెలవారీ ఖర్చుల నిర్వహణలో పెద్ద ఊరటనివ్వనుంది. ఏప్రిల్ నెలలోనే ఈ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో కోట్లాది కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News