YS Sharmila: వారి జీవితాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌కు లేదా?

YS Sharmila: హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌లకు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల మద్దతు పలికారు.

Update: 2021-08-11 11:49 GMT

YS Sharmila: వారి జీవితాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌కు లేదా?

YS Sharmila: హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌లకు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల మద్దతు పలికారు. ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వారి జీవితాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌కు లేదా? అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్‌ తన బాధ్యతను విస్మరిస్తే ఫీల్డ్‌ అసిస్టెంట్లు దాన్ని గుర్తు చేస్తూ సమ్మె చేస్తే వారి జీతాలు పెంచాల్సింది పోయి ఉద్యోగాల నుంచే తీసేస్తారా? అని ఆమె నిలదీశారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న వారిని తెలంగాణ ప్రభుత్వం అకారణంగా తొలగించడం దారుణమని ఆమె అన్నారు. తొలగించినవారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.

Tags:    

Similar News