YS Sharmila: ఈటలపై విచారణను స్వాగతిస్తున్నాం: వైఎస్ షర్మిల

Update: 2021-05-01 12:08 GMT

వైఎస్ షర్మిల ఫైల్ ఫోటో

YS Sharmila: ఈటల భూకబ్జా ఆరోపణల వ్యవహారంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే అన్న షర్మిల.. ఈటలపై విచారణను స్వాగతిస్తున్నా అన్నారు. అయితే.. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌పై షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. అయ్యా కేసీఆర్ దొరగారు.. ఇది పొమ్మనలేక పొగపెట్టడమా? లేక మీమ్మల్ని ప్రశ్నిస్తున్నారని వాళ్ల పదవికి ఎసరు పెట్టడమా అని ప్రశ్నించారు. ఈటలపై పదిమంది ఫిర్యాదు చేయగానే.. పది నిమిషాల్లో విచారణకు ఆదేశించిన మీరు.. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిలపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ప్రతినిధులపై ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు.




Tags:    

Similar News