YS Sharmila: షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు

YS Sharmila: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి వైఎస్ షర్మిల ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

Update: 2021-03-01 15:29 GMT

YS Sharmila (ఫోటో ట్విట్టర్)

YS Sharmila: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి వైఎస్ షర్మిల ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 9న పార్టీపేరు అనౌన్స్ చేస్తారని సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి 2003లో తలపెట్టిన 1500 కిలోమీటర్ల పాదయాత్ర సరిగ్గా ఏప్రిల్ 9న ముగిసింది. అందుకే షర్మిల ఇదే రోజున పార్టీని ప్రకటిస్తారని వైఎస్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో లక్షమందితో బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ పేరును ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

అలాగే మే మొదటి వారంలోనే కొత్త పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన కూడా చేస్తారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వైఎస్ షర్మిల ముందు ప్రస్తుతం మూడు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ టీపీ, వైఎస్ఆర్ పీటీతో పాటు రాజన్న రాజ్యం అనే పేరును కూడా ఆమె పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ 9న పార్టీ పేరు, పార్టీ గుర్తుతో పాటు పార్టీ విధి విధానాలను ప్రకటించనున్నారు షర్మిల. 

Tags:    

Similar News