Peddapalli: పుట్టా మధు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుల మధ్య మాటల యుద్ధం

గోదావరిఖని సింగరేణి ఓసీపీ-5 ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లిన సభ

Update: 2021-07-15 13:03 GMT

పుట్టా మధు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో జరిగిన సింగరేణి ఓసీపీ-5 ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ హయాంలో సింగరేణిని బొందల గడ్డగా మార్చి, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పుట్టా మధు ప్రశ్నించారు. పుట్టా మధు కామెంట్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో సభ దద్దరిల్లింది.

Tags:    

Similar News