Gadwal: భర్తపై వేడి నూనె పోసిన భార్య .. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Gadwal: కుటుంబ కలహాలతో భర్తపై వేడి నూనె పోసిందో భార్య.. ఐదు రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందిన భర్త నేడు మృతి చెందాడు.
Gadwal: కుటుంబ కలహాలతో భర్తపై వేడి నూనె పోసిందో భార్య.. ఐదు రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందిన భర్త నేడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్లెందొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మ వెంకటేష్లకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే.. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 10వ తేదీ రాత్రి మరోసారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలోనే ఉదయం 5 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్తపై వేడినూనె పోసింది భార్య. తీవ్ర గాయాలు కావడంతో.. కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్సపొందుతున్న వెంకటేష్.. మృతి చెందాడు. భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం పద్మను రిమాండ్కు తరలించారు.