భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నందిపేటకు చెందిన ఓ వ్యక్తితో మంజులకు 2015లో వివాహం జరిగింది. అయితే భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు ప్రబుద్ధుడు. దీంతో బాధిత మహిళ.. భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆమెకు మద్దతుగా మహిళా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.