Telangana: మల్లారెడ్డిని కేసీఆర్ ఎందుకు బర్తరఫ్ చేయలేదు? ఉత్తమ్

Telangana: టీఆర్ఎస్ అధికార మదం, అక్రమాలతో దుష్టపాలన సాగిస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Update: 2021-04-09 11:21 GMT

Telangana: మల్లారెడ్డిని కేసీఆర్ ఎందుకు బర్తరఫ్ చేయలేదు?- ఉత్తమ్ 

Telangana: టీఆర్ఎస్ అధికార మదం, అక్రమాలతో దుష్టపాలన సాగిస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోడు భూముల సమస్యలను చెప్పడానికి కేసీఆర్ సభకు వస్తే గిరిజనులను కుక్కలతో పోల్చారని మండిపడ్డారు. టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డా ఉత్తమ్ మల్లారెడ్డిని ఎందుకు బర్తరఫ్ చేయలేదని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నలుగురు ఎమ్మెల్యేలు బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని, తెలంగాణ పరువు తీసిన ఈ నలుగురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News