Uttam Kumar: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణకు ఆదేశిస్తాం

Uttam Kumar: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కోసం ప్రయత్నిస్తం

Update: 2023-12-11 12:41 GMT

Uttam Kumar: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణకు ఆదేశిస్తాం

Uttam Kumar: జలసౌధలో నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో .. రివ్యూ నిర్వహించిన మంత్రి.. ప్రాజెక్టుల వారిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం అనుమతితో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ సైట్ మార్చి పేరు మార్చి ఖర్చు పెంచారని.. ఖర్చు పెంచినా.. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేదన్నరు. కృష్ణానది జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాపై చర్యలు తీసుకుంటామని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కోసం ప్రయత్నిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

వీటితోపాటు.. అన్ని ప్రాజెక్టులకు ఖర్చు అవుతున్న విద్యుత్ వినియోగం ఎంత..? ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఎంత అన్న అంశాలపై చర్చించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులపై లోతుగా సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా జరగాలని... అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. ప్రజల డబ్బులతో ప్రాజెక్టులను కడుతున్నామని... ప్రజలకు పూర్తి బాధ్యతాయుతంగా, జవాబు దారి తనంతో పని చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

Tags:    

Similar News