ప్రియాంక హత్య కేసు... బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం

Update: 2019-11-30 07:04 GMT

ప్రియాంక హత్య కేసులో షాద్ నగర్ జిల్లా బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులకు ఎవరూ న్యాయ సహాయం చేయకూడదని తీర్మానించారు. నిందితుల తరపున ఏ న్యాయవాది కూడా వాదించొద్దని షాద్‌నగర్ న్యాయవాదులు విన్నవించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని తెలిపింది. షాద్‌నగర్ పోలీసు స్టేషన్ ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Tags:    

Similar News