Revanth Reddy: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పుడే చెప్పం

మంచి అభ్యర్ధిని ప్రకటిస్తాం కౌశిక్ వ్యవహారం ముందే తెలుసు టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం ఉంది

Update: 2021-07-13 16:15 GMT

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పుడే చెప్పం. కానీ మంచి అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు రేవంత్ రెడ్డి. కౌశిక్ వ్యవహారం ముందే తెలుసని టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు ముందే సమాచారం ఉందన్నారు. అక్కడ కౌశిక్ కు టీఆర్ఎస్ టికెట్ ఇస్తారని అనుకోవడం లేదని టీఆరెస్ ప్రచారం చేస్తున్నా వారికీ అభ్యర్థి కరువయ్యాడని రేవంత్ రెడ్డి అన్నారు. కౌశిక్ రెడ్డి చిన్న పిల్లవాడు.. కౌశిక్ మాటలు కాదు.. కేసీఆర్ మాట్లాడించిన మాటలు అని రేవంత్ మండిపడ్డారు. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని చెప్పారు. అన్ని సామజిక వర్గాలకు కాంగ్రెస్ లో సమన్యాయం ఉంటుందన్నారు. ఎల్.రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి కేసీఆర్ టీఆర్ఎస్ లోకి తీసుకున్నారని రేవంత్ విమర్శించారు. చాలా మంది ఇతర పార్టీల నేతలు టచ్ లోకి వస్తున్నారని ముగ్గురు కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని రేవంత్ అన్నారు. 

Tags:    

Similar News