బాసర ట్రిపుల్‌ ఐటీలో మళ్లీ వివాదం

Basara IIIT: E3 విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ఇన్‌ఛార్జ్‌ వీసీ

Update: 2022-07-23 04:53 GMT

బాసర ట్రిపుల్‌ ఐటీలో మళ్లీ వివాదం

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. E3 విద్యార్థులకు సెమిస్టర్‌ బ్రేక్‌ సెలవులు ప్రకటించారు ఇన్‌ఛార్జ్‌ వీసీ వెంకటరమణ. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ యాజమాన్యానికి విద్యార్థులు విధించిన డెడ్‌లైన్‌ రేపటితో ముగియనుంది. దీంతో యాజమాన్యానికి ఈ విషయాన్ని గుర్తు చేసే విధంగా మరో 48 గంటలే అంటూ నిన్న విద్యార్థులు ట్వీట్‌ చేశారు. ఇలా ట్వీట్‌ చేసిన గంట సేపటికే ఇన్‌ఛార్జ్‌ వీసీ సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించమంటే సెలవులు ప్రకటిస్తారా? అంటూ మండిపడుతున్నారు.

Tags:    

Similar News