పీసీసీ ఛీఫ్‌గా ఉత్తమ్ : కుంతియా క్లారిటీ

Update: 2019-06-24 08:55 GMT

కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలకు హస్తం పార్టీ సిద్ధమైంది. కోమటిరెడ్డిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌‌ కుంతియా తెలియజేశారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ చాలా గౌరవం ఇచ్చిందని కాని ఆయన ఎందుకలా చేస్తున్నారో తెలియడం లేదన్నారు. టీ పీసీసీ అధ్యక్షుడిని మార్పు చేస్తారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కుంతియా ఇకపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డే పీసీసీగా కొనసాగుతారని తెలిపారు.  

Tags:    

Similar News