తమ్ముడు కేటీఆర్ నిజాలు తెలుసుకొని మాట్లాడు : ఉత్తమ్

కేటీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ అసత్యాలు మాట్లాడని విమర్శించారు. హుజూర్ నగర్ అభివృద్ధి జరగలేదంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు.

Update: 2019-10-05 10:50 GMT

కేటీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ అసత్యాలు మాట్లాడరని విమర్శించారు. హుజూర్ నగర్ అభివృద్ధి జరగలేదంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. తమ్ముడు కేటీఆర్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయంలో వేసిన రోడ్లపైనే కేటీఆర్ తిరిగారన్నారు. ఎవరో రాసిచ్చిన స్ర్కిప్టును కేటీఆర్ చదివారని ఆరోపించారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్ నగర్ లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని దుయ్యాబట్టారు.హుజూర్‎నగర్‎లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని అన్నారు. అరాచకానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 21 హుజూర్ నగర్ ఉపఎన్నిక జరగనుంది. 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి, బీజేపీ నుంచి రామారావుతోపాటు టీడీపీ తరపున కిరణ‌్మయి పోటీ చేస్తున్నారు. హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో పోటీ రసవత్తరంగా మారనుంది.

Tags:    

Similar News