Kishan Reddy: కేసీఆర్ కుటుంబంలో నేతలు ఎక్కువైపోయారు.. అందుకే జాతీయ పార్టీ పెడుతున్నారేమో
Kishan Reddy: కేసీఆర్ జాతీయ పార్టీతో ఎవరికీ ఏమీ నష్టం లేదు
Kishan Reddy: కేసీఆర్ కుటుంబంలో నేతలు ఎక్కువైపోయారు.. అందుకే జాతీయ పార్టీ పెడుతున్నారేమో
Kishan Reddy: ముఖ్యమంత్రికేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలిని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ నాయకులు ఎక్కువైపోయారన్న ఆయన అందుకే ఆయన దేశ రాజకీయాల్లోకి రావాలని, జాతీయ పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి రాష్ట్రంలో ఉన్న పదవులు సరిపోవడం లేదా అని సెటైర్ వేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్న కిషన్ రెడ్డి దాని నుండి దృష్టి మరల్చడానికే ఈ జాతీయ పార్టీ ను తెరపైకి తెచ్చారన్నారు.