Amit Shah: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది

Amit Shah: కాంగ్రెస్ కుటుంబ పార్టీ.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేదు

Update: 2022-07-03 08:41 GMT

Amit Shah: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది

Amit Shah: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ కేంద్రంగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా రెండో రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పార్టీ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసోం, కర్ణాటక సీఎంలు హిమంత బిశ్వశర్మ, బసవరాజు బొమ్మైలు ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఈ తీర్మానంలో అమిత్ షా పలు కీలక అంశాలను ప్రతిపాదించారు. ఈ తీర్మానంపై సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.

కొత్తగా తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్‌లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని సదరు తీర్మానాన్ని అమిత్ షా ప్రతిపాదించారు. అంతేకాకుండా కేరళ, ఏపీలోనూ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని తెలిపారు. అంతేకాకుండా బీజేపీ ఏ ఒక్క రాష్ట్రాన్ని ప్రత్యేక దృష్టితో చూడదని దేశంలోని అన్ని రాష్ట్రాలను ఏకదృష్టితోనే చూస్తుందన్నారు అమిత్ షా.

Tags:    

Similar News